Bhishma Ekadashi 2026 హిందూ సంప్రదాయంలో ఏకాదశి అంటేనే ప్రత్యేకమైన రోజు. అందులో మళ్లీ భీష్మ ఏకాదశి అనగానే మనసులో మహాభారతం, భీష్మ పితామహుడు, విష్ణు సహస్రనామాలు గుర్తొస్తాయి కదా? ఈ ఏడాది ఈ ముఖ్యమైన రోజు జనవరి 29న వస్తోంది. రండి, దీని వెనుక ఉన్న కథ, ప్రాధాన్యత, ఎలా ఆచరించాలో సరళంగా చూద్దాం.
మహాభారతంలో భీష్మ ఏకాదశి నేపథ్యం
మహాభారత యుద్ధం అయిపోయాక భీష్ముడు బాణాల మీద పడి ఉన్నాడు. ఉత్తరాయణ పుణ్యకాలం రావాలని ఆయన ఐదు దశాబ్దాలు ఆగాడు. చివరికి మాఘ శుక్ల ఏకాదశి రోజున శ్రీకృష్ణుడిని స్తుతించి, పాండవులకు విష్ణు సహస్రనామాలు బోధించి మోక్షం పొందాడు. అందుకే ఈ రోజుకు భీష్మ ఏకాదశి అని పేరు వచ్చింది. కొన్ని చోట్ల జయ ఏకాదశి లేదా భైమీ ఏకాదశి అని కూడా పిలుస్తారు.
2026లో భీష్మ ఏకాదశి తేదీ, సమయాలు
ఈ ఏడాది భీష వ ఏకాదశి జనవరి 29, గురువారం నాడు ఆచరిస్తారు. ఏకాదశి తిథి జనవరి 28 సాయంత్రం 4:35 గంటలకు మొదలై, మరుసటి రోజు మధ్యాహ్నం 1:55 గంటల వరకు ఉంటుంది. ఉదయ తిథి ప్రకారం 29నే వ్రతం ఆచరించడం శ్రేఠం అని పంచాంగాలు చెబుతున్నాయి.
ఈ రోజు విశిష్టత ఏమిటి?
ఈ రోజు వ్రతం ఆచరిస్తే శత్రువుల నుంచి విముక్తి, మనశ్శాంతి, సంతాన భాగ్యం, కార్యసిద్ధి లభిస్తాయని నమ్మకం. పాపాలు తొలగి, మోక్షం దగ్గరవుతుందని చెబుతారు. ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే ఈ ఏకాదశి మరింత శక్తివంతమైనది. కొత్త పనులు ప్రారంభించడానికి కూడా ఉత్తమమని అంటారు.
విష్ణు సహస్రనామ జయంతి ప్రాధాన్యం
పూర్వపీఠిక & ధ్యాన శ్లోకాలు
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ ।
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ॥
యస్య ద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరశ్శతమ్ ।
విఘ్నం నిఘ్నన్తి సతతం విష్వక్సేనం తమాశ్రయే ॥
(ధ్యాన శ్లోకాలు – లక్ష్మీనారాయణుడిని ధ్యానించేందుకు)
క్షీరోదన్వత్ప్రదేశే శుచిమణివిలసత్సైకతే మౌక్తికానాం మాలాక్లుప్తాసనస్థః స్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండితాంగః । శుభ్రైరభ్రైరదభ్రైరుపరివిరచితైర్ముక్తపీయూషవర్షైః ఆనందీనః పునీయాదరినలినగదాశంఖపాణిర్ముకుందః ॥
శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగమ్ । లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథమ్ ॥
సహస్రనామాలు మొదలు (మొదటి కొన్ని శ్లోకాలు)
విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్యభవత్ప్రభుః ।
భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః ॥ ౧ ॥
పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమా గతిః ।
అవ్యయః పురుషః సాక్షీ క్షేత్రజ్ఞోఽక్షర ఏవ చ ॥ ౨ ॥
యోగో యోగవిదాం నేతా ప్రధానపురుషేశ్వరః ।
నారసింహవపుః శ్రీధ్రః కృష్ణః సత్యసాధనః ॥ ౩ ॥
(ఇలా 1000 నామాలు 107 శ్లోకాల్లో ఉంటాయి. చివరి శ్లోకం: ఇతి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం సంపూర్ణమ్.)
ప్రయోజనాలు (ఫలశ్రుతి సారాంశం)
ఈ స్తోత్రం నిత్యం పఠిస్తే పాపాలు తొలగి, ధనవంతుడు, ఆరోగ్యవంతుడు, మోక్షం లభిస్తుంది. భీష్ముడు చెప్పినట్టు ఇది సర్వోత్తమ ధర్మం!
ఈ రోజే విష్ణు సహస్రనామాల “జన్మదినం” అని చెప్పుకుంటారు. భీష్ముడు పాండవులకు వెయ్యి నామాలు Bోధించిన రోజు కాబట్టి. ఈ రోజు సహస్రనామ పారాయణం చేస్తే పాపాలు తొలగి, ఏ పని మొదలుపెట్టినా విజయం సాధిస్తారని భక్తుల నమ్మకం. చాలా మంది ఈ రోజు ప్రత్యేకంగా పఠిస్తారు.
ఎలా ఆచరించాలి? పూజ విధానం Bhishma Ekadashi 2026
వ్రతం ఉండి, ఉదయాన్నే స్నానం చేసి శ్రీమహావిష్ణువును, లక్ష్మీదేవిని పూజించండి. విష్ణు సహస్రనామ పారాయణం తప్పనిసరి. భీష్ముడికి తర్పణం ఇవ్వడం, తులసి పూజ, దాన ధర్మాలు చేయడం మంచిది. సత్యనారాయణ వ్రతం కూడా చేవారు ఉన్నారు. సాయంత్రం ద్వాదశి పరణ చేసుకోవచ్చు. ఇలా చేస్తే ఈ రోజు పుణ్యఫలం రెట్టింపవుతుందని చెబుతారు.
భీష్మ ఏకాదశి అంటే కేవలం వ్రతం మాత్రమే కాదు, మన జీవితంలో ధైర్యం, ధర్మం, భక్తి గుర్తు చేసే రోజు. ఈ ఏడాది మీరు కూడా ఆచరించి, ఆ ఆశీస్సులు పొందండి!
Skoda Kushaq Classic Plus Features స్కోడా కుషాక్ క్లాసిక్ ప్లస్ బేస్ వేరియంట్లో
Follow On: facebook| twitter| whatsapp| instagram