Mother of Orphans Sindhutai జీవితంలో ఎంతటి కష్టాలు వచ్చినా, మనసులో ఒక చిన్న నిప్పు ఉంటే చాలు… అది పెద్ద అగ్నిపర్వతంగా మారి చుట్టూ ఉన్న చీకట్ని పారద్రోలుతుంది. అలాంటి అద్భుతమైన జీవితం సింధుతాయి సప్కాల్ది.
సమాజం తిరస్కరించినప్పుడు, భర్త గెంటేసినప్పుడు, ఎవరూ ఆదరించని రోజుల్లో కూడా ఆమె తనలోని శక్తిని కనుగొని, వందలాది మంది అనాథ పిల్లలకు తల్లిగా మారింది. ఆమె కథ వింటే కళ్ళు చెమర్చక మానవు.
చిన్నతనంలోనే కష్టాల ముఖం చూసిన బాలిక

)






మహారాష్ట్రలోని వర్ధా జిల్లాలో ఒక చిన్న గ్రామంలో సింధుతాయి జన్మించింది. కుటుంబం బాగా పేదరికంలో ఉండేది. ఆడపిల్ల అని చదువుకు అవకాశం ఇవ్వలేదు. చిన్న వయసులోనే – ఇంకా 10 ఏళ్లు నిండకముందే – 30 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. ఆ ఇల్లు కూడా సుఖసంతోషాలతో నిండి లేదు. భర్త కఠిన స్వభావం, ఎప్పుడూ అనుమానాలు. కానీ సింధుతాయి ఓపికతో జీవితాన్ని నడిపించింది.
ఒక్కసారిగా జీవితం తలకిందులు
నిండు గర్భిణిగా ఉన్న రోజులు. ఒకరి అబద్ధపు మాటలు నమ్మి భర్త ఆమెపై దాడి చేశాడు. పొట్టమీద గట్టిగా తన్నాడు. “పో… ఎక్కడికి వెళ్లినా వెళ్లు” అంటూ ఇంటి నుంచి తరిమేశాడు. ఆ రాత్రి గొడ్డుచావిడిలో ఒంటరిగా ప్రసవ వేదనతో అలమటించింది. ఎవరూ సాయం చేయడానికి లేరు. చుట్టూ ఆవులు మాత్రమే. చివరికి ఆవుపేడలో, బురదలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. బొడ్డుతాడు కోసేందుకు కత్తి లేదు. పక్కన పడి ఉన్న పదునైన రాయితో తనే తెంపేసుకుంది. ఆ బాధ ఎవరు ఊహించగలరు?
తర్వాత పుట్టింటికి వెళ్లింది. కనీసం అక్కడైనా ఆదరణ దొరుకుతుందని. కానీ తల్లి కూడా తలుపులు మూసేసింది. “భర్త వదిలేసిన దానివి, మాకు అవసరం లేదు” అని. ఇక ఆమెకు మార్గం లేదు.
భిక్షాటన, శ్మశానవాసం… నరకం లాంటి రోజులు
రైల్వే స్టేషన్లలో బిచ్చగత్తెలా మారింది. పాటలు పాడుతూ బిచ్చమెత్తుకుంది. రాత్రులు శ్మశానంలో పడుకుంది. ఎందుకంటే… అక్కడ మనుషులు రారు, ఎవరూ హింసించరు అని. ఆకలైతే శవాల మీద చల్లిన అన్నంలోంచి కొన్ని ముద్దలు తినేది. చలి తట్టుకోలేక చితి మంటల దగ్గర కూర్చునేది. ఒకరోజు ఇక చాలు అనిపించి రైలు కింద పడి చనిపోదామనుకుంది.
అప్పుడే జరిగిన ఒక చిన్న సంఘటన ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. ఆకలితో అలమటిస్తున్న ఒక ముసలి బిచ్చగాడు కనిపించాడు. ఆమె వద్ద ఉన్న ఒకే ఒక రొట్టె ముక్కను అతనికి ఇచ్చేసింది. ఆ క్షణంలో ఆమెకు ఒక గొప్ప ఆలోచన వచ్చింది – “నా బాధ నాది మాత్రమే కాదు. ఈ ప్రపంచంలో ఎంతో మంది పిల్లలకు అమ్మ లేదు, ఆదరణ లేదు. నేను వాళ్లకు అమ్మ అవుతాను.”
అనాథల తల్లిగా మారిన మహిళ
అక్కడి నుంచి సింధుతాయి జీవితం మారిపోయింది. అనాథాశ్రమాలు ప్రారంభించింది. రోడ్లపై, రైల్వే స్టేషన్లలో ఒంటరిగా తిరిగే పిల్లలను స్వీకరించింది. వాళ్లను పెంచి, చదివించి, డాక్టర్లు, ఇంజనీర్లు, ఉపాధ్యాయులుగా తయారు చేసింది. 1500 మందికి పైగా పిల్లలు ఆమె చేతుల మీద పెరిగారు. ఆమెను “అనాథల తల్లి” అని పిలుస్తారు. తన సొంత బిడ్డను కూడా ఆర్థిక ఇబ్బందుల వల్ల దత్తత ఇవ్వాల్సి వచ్చింది. కానీ ఆ బాధను ఇతర పిల్లల సేవలో మరచిపోయింది.
చివరి రోజుల్లో తనను గెంటేసిన భర్తను కూడా క్షమించి, ఆదరించింది. అతన్ని కూడా తన పిల్లల్లో ఒకడిగా చూసుకుంది.
గుర్తింపు, పద్మశ్రీ… ఆమె వారసత్వంMother of Orphans Sindhutai
సింధుతాయి సేవలకు దేశం గుర్తింపు ఇచ్చింది. పద్మశ్రీ అవార్డు అందుకుంది. వందలాది అవార్డులు, సన్మానాలు వచ్చాయి. 2022లో ఆమె కన్నుమూశారు. కానీ ఆమె పెంచిన పిల్లలు ఇప్పటికీ ఆమె ఆశయాలను కొనసాగిస్తున్నారు. ఆమె కథ ఇప్పటికీ లక్షల మందికి ప్రేరణగా నిలుస్తోంది.
Follow On: facebook| twitter| whatsapp| instagram
2026 Tata Punch Facelift Best Value టాటా పంచ్ ఫేస్లిఫ్ట్లో బెస్ట్ వాల్యూ ఫర్