Pakistan ISI పాకిస్తాన్ మళ్లీ తన పాత ఆటలు మొదలుపెట్టిందని భారత నిఘా వర్గాలు గట్టిగా హెచ్చరిస్తున్నాయి. పాత ఉగ్రవాద నాయకులు వయసు మళ్లిన కొద్దీ, వాళ్ల కుటుంబ సభ్యులనే కొత్త తరం టెర్రర్ బాస్లుగా తయారుచేస్తూ.. భారత్ మీద దాడులకు సిద్ధమవుతున్నారట

ఐఎస్ఐ, పాక్ ఆర్మీ. ఇది కేవలం పుకారు కాదు, నమ్మదగిన సమాచారం అంటున్నాయి మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు.
నేపథ్యం: పాక్ ఎప్పటి నుంచో ఇలాంటి ఆటలే

పాకిస్తాన్కు ఉగ్రవాదంతో పెనన్న బంధం ఎప్పటి నుంచో తెలిసిందే. లష్కర్-ఇ-తొయిబా, జైష్-ఇ-మహ్మద్ వంటి సంస్థల ద్వారా భారత్ మీద ప్రాక్సీ యుద్ధం చేస్తూ వస్తోంది. గతంలో ఆపరేషన్ సిందూర్లో మురిడ్కేలోని లష్కర్ ప్రధాన కేంద్రం ధ్వంసమైంది. కానీ ఇప్పుడు దాన్ని మళ్లీ కట్టి, 2026 బ్యాచ్ శిక్షణ దాదాపు పూర్తయిందంట. త్వరలోనే గ్రాడ్యుయేషన్ సెలబ్రేషన్ కూడా జరగనుందట!
ఏమి జరుగుతోంది: కుమారులు, బంధువులే కొత్త బాస్లు
పాత బాస్లు హఫీజ్ సయీద్, మసూద్ అజార్లు వయసు మీరిన కొద్దీ వాళ్ల బాధ్యతలు కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు. హఫీజ్ కుమారుడు తల్హా సయీద్ను లష్కర్ తదుపరి అధిపతిగా తయారుచేస్తున్నారు – డబ్బు సేకరణ నుంచి అంతర్జాతీయ నెట్వర్క్ల వరకు పూర్తి శిక్షణ ఇస్తున్నారట. మసూద్ అజార్ సోదరుడు అబ్దుల్ రఊఫ్ అసాద్ జైష్ ఆపరేషన్లు చూసుకుంటూ సరిహద్దు దాటి దాడులు ప్లాన్ చేస్తున్నాడట.
నిఘా సంస్థల హెచ్చరిక: జమ్మూ-కాశ్మీర్పై ఫోకస్
భారత నిఘా వర్గాలు చెబుతున్న మాట – పాక్లో బహవల్పూర్లో ఇటీవల జరిగిన హైలెవల్ మీటింగ్లో ఐఎస్ఐ, ఆర్మీ, ఉగ్ర కమాండర్లు కలిసి భారీ ఇన్ఫిల్ట్రేషన్లు, పహల్గామ్ లాంటి కోఆర్డినేటెడ్ దాడులు ప్లాన్ చేశారట. లష్కర్, జైష్ ఇప్పుడు కలిసి పనిచేయనున్నాయి. ఆర్మీ, కొన్ని స్వచ్ఛంద సంస్థల పేరుతో భారీ నిధులు పంపిస్తున్నారు.
ప్రభుత్వం, భద్రతా దళాల ప్రతిస్పందన
భారత ప్రభుత్వం, సైన్యం ఇలాంటి హెచ్చరికలతో ఇప్పటికే అప్రమత్తమయ్యాయి. సరిహద్దుల్లో నిఘా పెంచారు, డ్రోన్ కార్యకలాపాలు, ఇతర కదలికలపై కంటికి రెప్పలా చూస్తున్నారు. గతంలో ఆపరేషన్ సిందూర్ లాంటి చర్యలతో పాక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను దెబ్బతీసినట్టే.. ఇప్పుడు కూడా అవసరమైతే కఠిన చర్యలు తీసుకుంటామన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
Pakistan ISI సోషల్ మీడియాలో ప్రతిచర్యలు
ఈ వార్తలు బయటకు వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. చాలా మంది “పాకిస్తాన్ ఎప్పుడూ మారదు, ఇలాంటి వాళ్లతో శాంతి మాటలు ఎందుకు?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు భారత్ బలమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. #NoMoreTalksWithPak వంటి హ్యాష్ట్యాగ్లు ట్రెండవుతున్నాయి.
ఇలాంటి పరిణామాలు మళ్లీ ఉద్రిక్తతలు పెంచే అవకాశం ఉంది. అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన సమయమిది.
Latest Job Openings 2026 తెలంగాణలో ఈరోజు ఉద్యోగ అవకాశాలు