Dhanush D54 ప్రేమలు”, “డ్యూడ్” వంటి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి మమితా బైజు, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ సరసన నటించే అరుదైన అవకాశాన్ని దక్కించుకుంది. విఘ్నేష్ రాజా దర్శకత్వంలో రూపొందనున్న ధనుష్ 54వ చిత్రంలో (D54) ఆమె కథానాయికగా ఎంపికైనట్లు సమాచారం.
తండ్రీ కొడుకుల సెంటిమెంట్తో కూడిన థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇందులో మమితా బైజు సాంప్రదాయ గ్రామీణ యువతి పాత్ర పోషించనున్నారని తెలుస్తోంది. ఈ పాత్ర కోసం మొదట పూజా హెగ్డేను అనుకున్నప్పటికీ, చివరకు మేకర్స్ మమిత వైపు మొగ్గు చూపారట అని తెలిసింది.

కాగా, ప్రస్తుతం మమితా బైజు చేతిలో సూర్య ‘Suriya 46’, విజయ్ చివరి సినిమాగా ప్రచారం అవుతున్న ‘జన నాయగన్’ సహా దాదాపు అర డజనుకు పైగా ప్రాజెక్ట్లు ఉన్నాయని, సౌత్ ఇండస్ట్రీలో ఆమె బిజీయెస్ట్ హీరోయిన్గా మారిందని ఈ కథనం సారాంశం.చూదాం మరి ఆమె కెరీర్ ఎలా ఉండబోతుందో …
Dhanush D54
Follow On : facebook | twitter | whatsapp | instagram
Google gemini : photo editing prompts |డేటా లీక్ risk is real?
